'Waltair Veerayya' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పోలీసుల గ్రీన్ సిగ్నల్..

by Disha Web Desk 6 |
Waltair Veerayya ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పోలీసుల గ్రీన్ సిగ్నల్..
X

దిశ, డైనమిక్ బ్యూరో : మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటిస్తు్న్న 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 8న విశాఖ సాగరతీరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1 వల్ల వేదిక మార్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో విశాఖ సాగరతీరంలో మూవీ యూనిట్ చేస్తున్న ఏర్పాట్లను పోలీస్ శాఖ నిలిపివేయాలని ఆదేశించింది. అనంతరం ఆంధ్ర యూనివ‌ర్సిటీ ఇంజ‌నీరింగ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను జరుపుకోవాల్సిందిగా పోలీస్ శాఖ సూచించింది. దీంతో వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ ఫంక్షన్ వేదిక ఇప్పుడు ఆంధ్ర యూనివ‌ర్సిటీ ఇంజ‌నీరింగ్ గ్రౌండ్స్‌కు షిఫ్ట్ అయ్యింది. పోలీసుల అనుమతి లభించడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లలో మునిగితేలుతున్నారు.

ఇకపోతే బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి ప‌క్కా మాస్ లుక్‌లో ఈ సినిమాలో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు మాస్ మహారాజ రవితేజ స్పెషల్ అప్పీరియన్స్ కూడా ఉండటం మరో విశేషం. చిరంజీవితో కలిసి ఓ పాటలో నటించడం గొంతు కలపడం కూడా చేశారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు వేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అగ్రహీరో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్‌లో జరగాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో అది కాస్తా బీఎంఆర్ అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్స్‌కు వేదిక మార్చిన సంగతి తెలిసిందే.

Also Read...

'Unstoppable 2'టాక్ షో‌లో ఆసక్తికర చర్చ..అది ఏంటంటే


Next Story

Most Viewed