పాయల్ రాజ్‌పుత్‌కు కిడ్నీ ఇన్ఫెక్షన్‌.. ఇన్‌స్టా పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో ఆందోళన

by Disha Web Desk 9 |
పాయల్ రాజ్‌పుత్‌కు కిడ్నీ ఇన్ఫెక్షన్‌.. ఇన్‌స్టా పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ గురించి పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, సినిమాలు, తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటుంది. RX100 పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఈ భామనే. తాజాగా తన ఆరోగ్యం గురించి ఒక షాకింగ్ న్యూస్ చెప్పిందీ బోల్డ్ బ్యూటీ. గత కొన్ని రోజుల నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నానని, ఇంట్లోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని చెబుతూ... ఒక నోట్ రాసుకొచ్చింది.‘ నేను చాలా తక్కువ వాటర్ తీసుకోవడం వల్లనే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. తద్వారా అనారోగ్యానికి గురయ్యాను. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్‌ ఒక్కటి తీసుకుంటే ట్రీట్ మెంట్ ముగిసినట్లే. నా రాబోయే ప్రాజెక్ట్ కోసం షూటింగ్‌ని ఆపడం నాకు ఇష్టం లేదు. మళ్లీ తిరిగి సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అడ్డంకులను అధిగమించాలి. షో మస్ట్ గో ఆన్. ఈసారి బిగ్గర్ అండ్ బెటర్‌గా ఉంటుంది. మీరందరూ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని మరోసారి గుర్తు చేస్తున్నారు. జాగ్రత్తా’ అంటూ తన ఆరోగ్యం గురించి తెలుపుతూ అభిమానులకు పలు సూచనలు చేసింది.

పాయల్ తన హెల్త్ కండిషన్ పై ఇలా అప్డెట్ ఇవ్వగా.. ‘ పాయల్ మీరు త్వరగా కోలుకోవాలి, మీ చేతికి ఉన్న సెలైన్ నిడిల్ చూసి తట్టుకోలేకపోతున్నాం అంటూ తన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ చేస్తోంది. గతంలో తను నటించిన ‘జిన్నా’ చిత్రంలో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయినా అంతటితో ఆగకుండా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. తమిళంలో ఆమె నటించిన ‘గోల్ మాల్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే ‘ఏంజెల్’, ‘కిరాతక’ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ‘మంగళవారం’ చిత్రంలో ఈ బ్యూటీ నటించనుందని సమాచారం.



Next Story

Most Viewed