ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ముందే చెప్పాను: Payal Ghosh

by Disha Web Desk 7 |
ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ముందే చెప్పాను: Payal Ghosh
X

దిశ, సినిమా: తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ 'ఆర్ఆర్ఆర్' మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా చక్రం తిప్పుతున్నాడు ఎన్‌టీఆర్. ఈ మూవీతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రీసెంట్‌గా బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.. తారక్‌కు వచ్చిన గ్లోబల్ గుర్తింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాయల్ ఘోష్ గతంలో తారక్ నటించిన 'ఊసరవెల్లి' సినిమాలో తమన్నాకు స్నేహితురాలిగా నటించింది. ఆ సమయంలో తారక్ నటన చూసి అభిమాని అయిపోయింది. అయితే రీసెంట్‌గా ఆయన గురించి స్పెషల్ ట్వీట్ చేసింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఆయన గ్లోబల్ స్థాయికి చేరుకుంటాడని నేను 2020లో చెబితే అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు ఏమైంది.. నేను చెప్పిందే నిజమైంది కదా' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed