బతికుండగానే నా ఫోటో వాళ్ల పక్కన పెట్టాడు .. హైపర్ ఆదిపై పావలా శ్యామల ఆగ్రహం

by Disha Web Desk 10 |
బతికుండగానే నా ఫోటో వాళ్ల పక్కన పెట్టాడు .. హైపర్ ఆదిపై పావలా శ్యామల ఆగ్రహం
X

దిశ,వెబ్ డెస్క్: పావలా శ్యామల తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే, ప్రస్తుతం పావలా శ్యామల పరిస్థితి బాగలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామల ఆపన్నహస్తం కోసం వేచిచూస్తున్నారు. తనతో పాటు తన కూతురు కూడా ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని ఆమె చెబుతోంది. శ్యామల పరిస్థితిని బయట ప్రపంచానికి చెప్పడానికి పలు యూట్యూబ్ ఛానెళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే, తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘జబర్దస్త్’ షో గురించి, హైపర్ ఆది గురించి ఆమె స్పందించారు.

‘జబర్దస్త్’ షోలో హైపర్ ఆది తన ఫొటోను చనిపోయినవాళ్ల ఫొటోలు పక్కన పెట్టి తాను కూడా చనిపోయినట్టు చిత్రీకరించారని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇంకా పోలేదు.. నా ఫోటో వాళ్లతో పెట్టడం చూసి నాకు చాలా బాధ కలిగింది. తాను చనిపోలేదని, అనారోగ్యం పాలయ్యానని శ్యామల చెప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో నేను జబర్దస్త్ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని, అక్కడికి వెళ్లి ఎందుకు ఇలా మాట్లాడావు, ఎవరు నీతో ఎవరు మాట్లాడించారు అని నేను అడగగలనా? ఆది దొరుకుతాడా? పోని నాకు ఫోన్ చేసి బతికున్నానా లేదా అని అడిగాడా?’ అంటూ పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed