చిరంజీవికి పద్మవిభూషన్.. కేంద్రం అధికార ప్రకటన?

by Disha Web Desk 8 |
చిరంజీవికి పద్మవిభూషన్.. కేంద్రం అధికార ప్రకటన?
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి సినిమా వచ్చిందంటే చాలు ఆయన జనరేషన్ వారే కాకుండా, ఈ జనరేషన్ వారు కూడా టీవీలకే అంకితం అవుతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈయన నటించిన సినిమాలు ఇప్పటికీ ఎంతో మందిమదిలో నిలిచిపోయాయి.తన నటనకు ఎంతో మంది ఫిదా అయిపోతారు.

అలాగే భారతీయ సినిమా పరిశ్రమలో ఈయన సాధించిన విజయాలు అవార్డులు, రివార్డులు అంతా ఇంతా కాదు.ఇండియన్ సినిమాకు చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవార్డులను అందజేశారు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల్లో చిరుకి మరో అరుదైన గౌరవం దక్కే అవకాశం ఉందంట.

2024 సంవత్సరంలో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల్లో చిరంజీవి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటిస్తారనే వార్త ప్రస్తుతం మీడియాలో సంచలనంగా మారింది. దీంతో మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడు చిరుకు పద్మ విభూషన్ అవార్డు అందిస్తారో అని ఎదురు చూకస్తున్నారు.

Next Story

Most Viewed