సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా పెద్దలకు మాత్రమే.. పిల్లలకు నో ఎంట్రీ!

by Disha Web Desk 6 |
సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా పెద్దలకు మాత్రమే.. పిల్లలకు నో ఎంట్రీ!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. దీనికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇందులో సునీల్, రాజీవ్ కనకాల, జాన్సీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపద్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నారు. తాజాగా, విరూపాక్ష సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాకు 18 ఏళ్ల లోపు ఉన్న వారికి అనుమతి లేనట్లు సమాచారం. పల్లెటూరుల్లో జరిగే చేతబడి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed