ఆదిపురుష్ సినిమాలో బిగ్ మిస్టేక్.. రామాయణం చూశారా అంటూ నెటిజన్స్ ఫైర్

by Dishanational2 |
ఆదిపురుష్ సినిమాలో బిగ్ మిస్టేక్.. రామాయణం చూశారా అంటూ నెటిజన్స్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎవరినోట చూసినా ఆదిపురుష్ పేరే వినిపిస్తుంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగి పోయాయి. ఎప్పుడె ప్పుడు మూవీ విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఆదిపురుష్ మూవీ విడుదలకు దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో పాల్గొంటొంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు, పోస్టర్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి.తాజాగా రిలీజ్ అయిన రెండవ ట్రైలర్ ను చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. కాగా, రెండో ట్రైలర్ తర్వాత ఆదిపురుష్ సినిమాపై వ్యతిరేకత ఏర్పడుతుంది. రామాయణం చూశారా.. ఆ తప్పు ఎలా చేశారంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా?

హనుమాన్ సీతా దేవి జాడ కోసం వెళ్తున్నప్పుడు శ్రీరాముడు తన ఉంగరాన్ని ఆనవాలుగా ఇస్తాడు. లంకలో సీతాదేవిని కలిసిన హనుమంతుడు రాముడి ఉంగరాన్ని చూపించి రామదూతగా పరిచయం చేసుకుంటాడు. సీతాదేవిని రాముడి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పగా, సీతాదేవి వారించి శ్రీ రాముడు రావణున్ని జయించి తనని తీసుకెళ్లాలని చెప్తుంది. తన ఆనవాలుగా చూడామణి హనుమంతుడికి ఇస్తుంది. ఇదే రామాయణంలో కనిపిస్తుంది. కానీ ఆదిపురుష్ ట్రైలర్ లో సీతాదేవి ఆంజనేయుడికి చూడామణి కాకుండా గాజులు ఇవ్వడం కనిపిస్తుంది. ట్రైలర్ లో ఇది క్లారిటీగా కనిపించడంతో ఏ ఆధారంతో దర్శకుడు గాజును చూపించాడు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Also Read:

దలితులకు ‘ఆదిపురుష్‌’ థియేటర్లలోకి నో ఎంట్రీ.. వివాదంపై స్పందించిన మూవీ యూనిట్..

గిప్పడి సంది గేమ్ అలగ్ ఉంటది’.. బాలయ్య ‘NBK108’ సినిమా టైటిల్ రివీల్

Next Story

Most Viewed