ఆ వీడియోలు తొలగించి, క్షమాపణ చెప్పిన అర్జున్ రెడ్డి నటుడు

by Disha Web Desk 2 |
ఆ వీడియోలు తొలగించి, క్షమాపణ చెప్పిన అర్జున్ రెడ్డి నటుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన భయానక ఫోటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు విమర్శలకు తావిచ్చాయి. శుక్రవారం ఒడిశాలో జరిగిన ఘోర రలు ప్రమాద ఘటనపై సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియోలను రాహుల్ రామకృష్ణ షేర్ చేశాడు. ఓ వైపు వందల సంఖ్యలో మరణించి, వేలాది కుటుంబాలు కన్నీటి సముద్రంలో మునిగిపోయిన సమయంలో ఇలాంటి విన్యాసాలు షేర్ చేయడం ఏంటని నెటిజన్లు ఏకిపారేశారు. ఈ క్రమంలో తన తప్పు తెలుసుకున్న రాహుల్ రామకృష్ణ వాటిని వెంటనే తొలగించాడు. అంతేకాదు, క్షమాపణ కూడా చెప్పాడు. తాను చేసిన ట్వీట్‌కు సారీ చెబుతున్నానని, ప్రామిస్..తనకు ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలియదని చెప్పాడు. తాను అర్ధరాత్రి నుండి స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నానని చెప్పాడు. తాను వార్తలు చూడలేదని, అందుకే ఈ తప్పు జరిగిందని, మరోసారి క్షమాపణ కోరుతున్నానని చెప్పాడు. ఆయన సారీ చెప్పడంతో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు.

Next Story

Most Viewed