అలాంటి దుర్మార్గులకు భావోద్వేగాల విలువ తెలియదు.. స్టార్ సింగర్

by Disha Web Desk 21 |
అలాంటి దుర్మార్గులకు భావోద్వేగాల విలువ తెలియదు.. స్టార్ సింగర్
X

దిశ, సినిమా : స్టార్ సింగర్ నేహా కక్కర్ తనను ఎగతాళి చేసే వ్యక్తులను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం 'సూపర్ స్టార్ సింగర్ 2' జడ్డీగా వ్యవహరిస్తున్న ఆమె.. ఈ షోలో 'మణి' అనే పోటీదారు తను పాడిన 'మాహి వే' పాట పాడుతున్నప్పుడు భావోద్వేగానికిలోనై కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో షోలో ఏడుస్తూ సింపతీ కొట్టేస్తుందంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

అయితే ప్రేక్షకులు ఇలా మాట్లాడటం తనను ఎంతో బాధించిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన నేహా.. 'ప్రతి ఒక్కరూ ఎదో ఒక సందర్భంలో ఎమోషనల్‌ అవుతారు. నేనైతే దాన్ని డ్రామా అని చెప్పను. అలాంటివారిని నిందించలేను. ఎగతాళి చేయలేను. ఎందుకంటే భావోద్వేగాలు లేని వ్యక్తులు నాకు నకిలీగా కనిపిస్తారు. నాలాంటి సున్నిత మనస్కులు మాత్రమే దానిలోతును అర్థం చేసుకుంటారు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక తానెప్పుడూ అందరితో మంచి సంబంధాన్ని కలిగి ఉండటాన్నే కోరుకుంటానన్న గాయని.. ప్రతిభావంతులెప్పుడూ ట్రోలింగ్‌ గురించి లెక్కచేయరని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి : మేనల్లుడితో భార్య పాడుపని... రెడ్ హ్యాండెడ్‌గా మామ పట్టుకోగానే...


Next Story