మేనల్లుడితో భార్య పాడుపని... రెడ్ హ్యాండెడ్‌గా మామ పట్టుకోగానే...

by Dishanational1 |
మేనల్లుడితో భార్య పాడుపని... రెడ్ హ్యాండెడ్‌గా మామ పట్టుకోగానే...
X

దిశ, వెబ్ డెస్క్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మేనల్లుడిని కర్రలతో భర్త కొట్టి చంపిన ఘటన కోల్ కతాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... కోల్ కతాలోని బెహ్లా సాకెర్ బజార్ కు చెందిన ఓ వ్యక్తి వ్యాపారస్తుడు. అయితే, అతని మేనల్లుడు ఫొటో గ్రాఫర్ గా పని చేస్తుంటాడు.

అయితే, అతడిపై వ్యాపారస్తుడు కర్రలతో దాడి చేశాడు. దీంతో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వ్యాపారస్తుడిని అరెస్ట్ చేసి విచారించగా.. మేనల్లుడితో కలిసి తన భార్య ఫొటోగ్రఫీ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టిందని, ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఇటీవల వారిద్దరినీ రెండుసార్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాడు. అయినా కూడా వారిద్దరూ చనువుగా ఉండడంతో ఆగ్రహంతో అతడిపై కర్రలతో దాడి చేసినట్లు తెలిపాడని అందులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని అందులో తెలిపారు.

ఇవి కూడా చదవండి : అలాంటి దుర్మార్గులకు భావోద్వేగాల విలువ తెలియదు.. స్టార్ సింగర్

Next Story

Most Viewed