నయనతార పెళ్లికి ముందే పిల్లలను కనడానికి ప్రయత్నించిందా..?

by Disha Web Desk 7 |
నయనతార పెళ్లికి ముందే పిల్లలను కనడానికి ప్రయత్నించిందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతారా.. డైరెక్టర్ విఘ్నేశ్‌ని 2022 జూన్ 9న ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ జంట మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే.. ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా మరోసారి ఈ జంట తీవ్ర విమర్శలపాలవుతోంది. నయన్, విఘ్నేష్ సోషల్ మీడియా వేదికగా కవల పిల్లల ఫొటోలు పెట్టి.. మేం తల్లిదండ్రుమయ్యామంటూ పోస్ట్ పెట్టారు. వారికి ఉయిన్, ఉలగం అని పేర్లు కూడా పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నప్పటికీ.. ఈ వార్తపై పలు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అందుకు కారణం.. ఈ జంట సరోగసీ ద్వారా పిల్లలను కన్నారనే..

ఈ సరోగసీ అంశంపై సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు తెర లేపింది. దీనిపై సీరియల్ ఆర్టిస్ కస్తూరి సైతం పరోక్షంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి పిల్లల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి నయన్-విఘ్నేశ్‌లకు సరోగసీకి సంబంధించిన వివరాలు, సమాచారం తమకు సమర్పించాలని ఆదేశించారు. కాగా.. ఈ సరోగసీ విధానాన్ని జనవరి 25, 2022న దేశంలో నిషేధించిన విషయం తెలిసిందే. ఈ విషయమై నయన్-విఘ్నేశ్‌లు ఏ రకంగా ఈ పిల్లలను కన్నారు.. ఎప్పుడు సరోగసీ వైద్యులను కలిశారు అనే దానిపై తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సరోగసీ విధానం అమలు చేయాలంటే మొదట భార్యాభర్తలయుండాలి. కానీ నయన్-విఘ్నేశ్‌లకు ఈ ఏడాది జూన్ 9న వివాహం జరగిందనే విషయం ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారింది. పెళ్లికి ముందే ఈ వివాదస్పద జంట సరోగసీకి వెళ్లారనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి సెలబ్రిటీలపై ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Next Story

Most Viewed