డైరెక్టర్‌గా మారిన మరో జబర్దస్త్ యాంకర్

by Disha Web Desk 9 |
డైరెక్టర్‌గా మారిన మరో జబర్దస్త్ యాంకర్
X

దిశ, సినిమా: జబర్దస్త్ ఫేం వేణు దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో మరో జబర్దస్త్ ఆర్టిస్టు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శాంతి కుమార్ తూర్లపాటి ‘నాతో నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా నటించిన సినిమాను ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తుండగా.. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. ‘టైటిల్‌ బాగుంది. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’ అని ఆశీర్వదించారు.

Also Read...

చాలా గ్యాప్ తర్వాత... కార్తీ జోడీగా తమిళ మూవీలో బేబమ్మ.. ?

Next Story

Most Viewed