రెండు మనసులు, ఒకటే ప్రాణం.. నరేష్, పవిత్ర ‘మళ్లీ పెళ్లి’

by Disha Web Desk 6 |
రెండు మనసులు, ఒకటే ప్రాణం.. నరేష్, పవిత్ర ‘మళ్లీ పెళ్లి’
X

దిశ, వెబ్ డెస్క్: పవిత్రా నరేష్, సహజీవనం చేస్తున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవల వారిద్దరూ పెళ్లి చేసుకున్న వీడియోను నరేష్ సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వీడియోతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. పెళ్లి తర్వాత వారు హానీమూన్‌కు కూడా వెళ్లినట్లు ఫొటోలు చక్కర్లు కొట్టాయి. కానీ, అదంతా ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా కోసమని ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ఎం ఎస్ రాజు దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇందులో జయసుధ, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా, మళ్లీ పెళ్లి టీజర్‌ను ఏప్రిల్ 13న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఏడు అడుగులు, రెండు మనసులు, ఒకటే ప్రాణం’ అనే క్యాప్షన్‌తో నరేష్, పవిత్ర కలిసి ఉన్న పోస్టర్‌ను వదిలారు.

Next Story