నా కొడుకు చావుకి అప్పులు కారణం కాదు: చైతన్య మాస్టర్ తల్లి

by Disha Web Desk 7 |
నా కొడుకు చావుకి అప్పులు కారణం కాదు: చైతన్య మాస్టర్ తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢీ షోలో కొరియోగ్రాఫర్‌గా ఉన్న చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. అప్పుల బాధ తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. అయితే.. చైతన్య మాస్టర్ ఆత్మహత్యపై అతని తల్లి స్పందించారు. తాజాగా చైతన్య మాస్టర్ తల్లి లక్ష్మీ రాయ్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాస్ట్యూమ్‌కు డబ్బులు కావాలంటూ నా దగ్గర రెండు, మూడు వేలు తీసుకునేవాడు. అంతే కాదు.. ఢీ ఫైనల్ కోసం రూ. 3,50,000 అడిగాడు. కానీ, వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. దాని కోసం ఓ రోజు అంతా అలిగి కూర్చున్నాడు.

ఆ డబ్బులు నేను తీసుకెళ్లి ఇచ్చాను. అమ్మ.. షోలో గెలిస్తే రూ. 7,50,000 వస్తాయి ఆ డబ్బు అంతా నీకే ఇచ్చేస్తా అన్నాడు. కానీ ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలియదు కానీ ఇలా రెండు సార్లు జరిగింది. నా కొడుకు ఢీ షోకి వెళ్లిన తర్వాత దాదాపుగా రూ. 6 లక్షల వరకు ఇచ్చాను. ఇంత చేసినదాన్ని నా కొడుకుకి అప్పులు ఉంటే తీర్చలేకపోయేదాన్నా..? అంటూ బాధ పడ్డారు. అప్పుల కారణంగా తను చనిపోయాడనే మరక ఉండకూడదనేది నా బాధ. ఢీ ల పేమెంట్స్ ఎలా ఇచ్చారు.. ఎంత ఇచ్చారు అనేవి నాకు తెలియదు కానీ.. తన కొడుక్కు గుర్తింపు తెచ్చింది ఆ షోనే. ఢీ లేక పోతే నా కొడుకు లేడు’’ అంటూ చెప్పుకొచ్చారు.

Also Read..

పెళ్లిలో డ్యాన్స్‌కు రూ. 2.5 కోట్లు తీసుకున్న బాలీవుడ్ హీరో

Next Story