అమితాబ్, అనుష్కలకు షాక్.. భారీగా ఫైన్ వేసిన ముంబై పోలీసులు

by Disha Web Desk 13 |
అమితాబ్, అనుష్కలకు షాక్.. భారీగా ఫైన్ వేసిన ముంబై పోలీసులు
X

దిశ, సినిమా: సెలబ్రేటీల విషయంలో ప్రేక్షకులు ఎంత అభిమానంతో ఉంటారో.. వారు రూల్స్ బ్రేక్ చేస్తే అంతే సీరియస్‌గా తీసుకుంటారు. ఇప్పుడు అమితాబ్, అనుష్క శర్మ విషయంలోనూ అదే జరిగింది. అమితాబ్ షూటింగ్‌కు లేట్ అవుతుందని ట్రాఫిక్‌లో ఇరుకున్న తన కారులో నుంచి దిగి బైక్‌పై లిఫ్ట్ అడిగి లొకేషన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేశాడు. అలాగే అనుష్క శర్మ కూడా హెల్మెట్ లేకుండా బైక్ జర్నీ చేసి ఫొటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో వీరిద్దరిపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకుగాను అమితాబ్‌కు రూ.1000, అనుష్కకి రూ. 10,500 జరిమానా వేశారు.

ఇందులో అనుష్కకు ఎందుకు ఎక్కువ వేశారని ప్రశ్నించగా.. ‘అమితాబ్ లొకేషన్‌‌కు ఒక వీధిలో నుంచి మరో వీధిలోకి మాత్రమే బైక్‌‌పై ప్రయాణించాడు. అది ప్రధాన రహదారి కాదు. నడుస్తూ వెళ్తే సెక్యూరిటీ సమస్య వస్తుందని భావించి లిఫ్ట్ అడిగి వెళ్లినట్లు వివరణ ఇచ్చాడు. అందుకే ఫైన్ విషయంలో అనుష్కకు ఎక్కువ జరిమానా పడింది’ అని పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది.

Also Read...

‘ఎమర్జెన్సీ’ చూపించి రాజమౌళి తండ్రిని కంటతడి పెట్టించిన కంగన..?


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed