మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?..

by Disha Web Desk 7 |
మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?..
X

దిశ, సినిమా: A2 పిక్చర్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్స్ నెం.1గా వస్తున్న చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’. సంధ్యా రాణి, స్వరూప రాణి నిర్మాణ సారథ్యంలో భవానీ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు మంచు మనోజ్ మొదటి క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి బాబీ గౌరవ దర్శకత్వం వహించాడు.

తర్వాత ఈ ముగ్గురు కలిసి టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్‌కు శుభాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకనిర్మాతలు.. గోపీ సుందర్ అందించిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ అవుతాయని, ఇందులో బ్రహ్మ పాత్ర ఓ స్టార్ హీరో చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే సోషియో ఫాంటసీ, మైథాలజీ, లవ్, ఫుల్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్న చిత్రాన్ని ప్రేక్షకుల ఆదరించాలని కోరారు.

Also Read...

మనోజ్‌‌ను వదిలేసిన మోహన్ బాబు.. విష్ణుతో కలిసి ఎక్కడికి వెళ్తున్నాడు?



Next Story

Most Viewed