ప్రధాని మోడీపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్

by Dishaweb |
ప్రధాని మోడీపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ దేశ రాజకీయాలపై ట్విట్టర్‌ వేదికగా.. తనదైన శైలిలో స్పందిస్తుంటారు. నరేంద్ర మోదీ పై ప్రకాశ్​రాజ్​ వ్యంగ్యంగా కామెంట్స్‌ చేశారు. మధ్యప్రదేశ్ లో ఒకేసారి ఐదు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీనిపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. “ఈ పనిని స్టేషన్ మాస్టర్ అయినా చేస్తారు. మిమ్మల్ని మేము మణిపూర్ లో చూడాలని భావిస్తున్నాం”అని ప్రకాష్ ట్వీట్ లో రాసుకొచ్చారు. అయితే మణిపూర్లో చెలరేగుతున్న హింసపై మోదీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్పందించని నేపథ్యంలో ప్రకాష్ ఈ ట్వీట్ చేశారు.

Read More..

మోడీని ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుకు వేధింపులు.. వైట్ హౌస్ రియాక్షన్ ఇదే!

Next Story

Most Viewed