‘దృశ్యం’ రీమేక్.. తొలిసారి ఇండియన్ సినిమాను రీమేక్ చేస్తున్న కొరియన్ ఇండస్ట్రీ..

by Dishaweb |
‘దృశ్యం’ రీమేక్.. తొలిసారి ఇండియన్ సినిమాను రీమేక్ చేస్తున్న కొరియన్ ఇండస్ట్రీ..
X

దిశ, సినిమా : మోహన్ లాల్-జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన మాలీవుడ్ ఫిల్మ్ ‘దృశ్యం’.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ రీమెక్ అయి సక్సెస్ అందుకుంది. సీక్వెల్‌ కూడా అదే రేంజ్‌లో విజయవంతమైంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం కొరియన్ రీమేక్‌గా రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. పారాసైట్ యాక్టర్ సాంగ్ కాంగ్ హీరోగా నటిస్తున్న సినిమాను కిమ్-జీ ఊన్ డైరెక్ట్ చేయనున్నాడని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అనౌన్స్ చేశారు. కాగా దీనిపై స్పందించిన మోహన్ లాల్.. సంతోషం వ్యక్తం చేశాడు. ఎన్నో కొరియన్ చిత్రాలను ఇండియన్ ఇండస్ట్రీ కాపీ చేసింది కానీ ఫస్ట్ టైమ్ ఒక భారతీయ చిత్రాన్ని కొరియన్ మూవీగా రీమేక్ చేయడం విశేషం. కాగా గర్వంగా ఉందంటూ ఇండియన్ సినీ లవర్స్ నెట్టింట కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed