నిన్ను చాలా మిస్ అవుతున్న.. సిమ్రాన్ ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 7 |
నిన్ను చాలా మిస్ అవుతున్న.. సిమ్రాన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సిమ్రాన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో, నడుము అందాలతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే.. ఎప్పుడు సోషల్ మీయాలో యాక్టీవ్‌గా ఉండే సిమ్రాన్.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది.

సిమ్రాన్‌కు మోనాల్ అనే చెల్లెలు ఉన్నారు. ఆమె కూడా సినీ ఇండస్ట్రీలో రాణించారు. అయితే కొన్ని అనివార్య కారణాల చేత 2002-ఏప్రిల్-14 న 21 ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకుని మరణించారు. ఇక నిన్న తన చెల్లి దూరం అయిన రోజు కావడంతో ఆమెను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ మేరకు ‘నా అందమైన సోదరి మోనాల్ ప్రేమపూర్వక జ్ఞాపకార్థం. నిన్ను ఎప్పటికీ మరచిపోలేరు’’ అంటూ తెలిపారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ సిమ్రాన్‌ను ఓదార్చేలా రిప్లేలు ఇస్తు్న్నారు.

Also Read..

మళ్లీ పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Next Story