‘రంగ మార్తాండ’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

by Disha Web Desk 6 |
‘రంగ మార్తాండ’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘నటసామ్రాట్’ చిత్రాన్ని తెలుగులో ‘రంగ మార్తాండ’ పేరుతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించాడు . ఇందులో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మార్చి 22న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తాజాగా, రంగ మార్తాండ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న ఓ అనూహ్యమైన పాత్రని చేయడం తొలిసారి. సెకండ్ హాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంట తడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించవలసినవి. ఇలాంటి రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాష్ రాజ్‌కి, రమ్యకృష్ణకు చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు.

Also Read..

మంచు బ్రదర్స్ దాని కోసమే కొట్టుకుంటున్నారా?

Next Story

Most Viewed