- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్
దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుక్రవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు లభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా రామ్ చరణ్ ను అభినందించారు. ఈ సందర్భంగా అమిత్ షా రామ్ చరణ్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలను కలవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వేదికమీద దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని షా కొనియాడారు. కాగా లాస్ ఏంజల్స్ లో నిర్వహించిన 95వ ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటాగిరీలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ నాటు నాటుకు అవార్డులు అందుకున్నారు.