15 రాత్రులు అదే పని.. నిద్ర లేకుండా చేశారన్న మిస్ వరల్డ్

by Disha Web Desk 7 |
15 రాత్రులు అదే పని.. నిద్ర లేకుండా చేశారన్న మిస్ వరల్డ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ షూటింగ్‌ అనుభవాలను పంచుకుంది. అక్షయ్ కుమార్ సినిమా 'సామ్రాట్: పృథ్వీరాజ్'తో ఆరంగేట్రం చేసిన ఈ అందగత్తె.. ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా వస్తున్న పొలిటికల్ డ్రామా 'టెహ్రాన్'లో నటిస్తోంది. కాగా ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన తన ఫస్ట్ లుక్ అభిమానులను అట్రాక్ట్ చేస్తుండగా ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'టెహ్రాన్' మూడవ షెడ్యూల్ సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభమై 15 రోజుల పాటు కొనసాగిందన్న ఆమె.. ఢిల్లీలోని బైలేన్‌లలో జరిగిన నైట్ షూట్ అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చిందని చెప్పింది. ఈ క్రమంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నానన్న బ్యూటీ.. ఈ సినిమా ముగిసేనాటికి మొత్తం 15 రోజులు నిద్రలేని రాత్రులు గడిపినట్లు వెల్లడించింది. అయితే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురైనపుడే తాను గొప్ప కళాకారిణిగా సంతృప్తి చెందుతానని, తన కెరీర్‌లో ఇదే మొదటి లాంగ్ నైట్ షూట్ షెడ్యూల్‌ అని చెప్పుకుంటూ మురిసిపోయింది.

Next Story