ప్రభాస్ రొయ్యల బిర్యానీకి మలయాళ దర్శకుడు ఫిదా.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన పోస్ట్

by Mallepaka Hamsa |

నా జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చినందుకు ప్రభాస్ గారికి, ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.

ప్రభాస్ రొయ్యల బిర్యానీకి మలయాళ దర్శకుడు ఫిదా.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. స్పిరిట్, ఫౌజీ, కల్కి-2 వంటి చిత్రాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ ఒక మలయాళ దర్శకుడికి అదిరిపోయే విందు ఇచ్చారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ సదరు దర్శకుడు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై కొత్త చర్చ మొదలైంది. మలయాళ హిట్ చిత్రాల దర్శకుడు దింజిత్ అయ్యతన్, ప్రభాస్‌ను కలిశారు. ఈ భేటీ గురించి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ ప్రభాస్ విందుపై ప్రశంసల వర్షం కురిపించారు. "ప్రభాస్ గారితో కలిసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన తినిపించిన రొయ్యల బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది.

నా జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చినందుకు ప్రభాస్ గారికి, ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు" అంటూ రాసుకొచ్చారు. ప్రభాస్ సాధారణంగా ఎవరికైనా విందు ఇచ్చారంటే అక్కడ ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ సెట్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఇక ఇప్పుడు మలయాళ దర్శకుడితో, అది కూడా 'సలార్' వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగడం చూస్తుంటే, ప్రభాస్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఇప్పటికే చేస్తున్న సినిమాలు పూర్తి కాకముందే దింజిత్‌తో ఒక వైవిధ్యమైన కథను ఓకే చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్, దింజిత్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story