ఏడాది పూర్తి చేసుకున్న ‘మేజర్’.. అడవి శేషు ట్వీట్ వైరల్ ..

by Disha Web Desk 6 |
ఏడాది పూర్తి చేసుకున్న ‘మేజర్’.. అడవి శేషు ట్వీట్ వైరల్ ..
X

దిశ, సినిమా: గతేడాది విడుదలైన బెస్ట్ సినిమాలలో ‘మేజర్’ ఒకటి. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేషు నటించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్‌లో విడుదలై, సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముంబై టెర్రర్ దాడిలో పోరాడి చనిపోయిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజై వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు అడివి శేషు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తనను ఆశీర్వదించి, అన్ని విధాలుగా మార్చాడంటూ.. ఆయన తల్లిదండ్రులను కలిసిన ఫొటోలు షేర్ చేశాడు. అమ్మ షోల్డర్ పెయిన్‌ లెక్కచేయకుండా తనకు వంట చేసి కడుపు నిండా తినిపించిందని.. వారి ప్రేమే తనకు అన్నీ అని తెలిపాడు. తన లైఫ్‌లో ‘మేజర్’ మోస్ట్ మెమొరబుల్ ఫిల్మ్ అని తెలిపిన అడివి శేషు.. ఈ సందర్భంగా మహేష్ బాబుతోపాటు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, మూవీ యూనిట్‌ అందరికీ థాంక్స్ చెప్పాడు.

Read Mores: ఆ సీక్రేట్ బయటపెట్టిన రకుల్.. హీరోయిన్ కాకపోతే ఆ పని చేసేదంట


Next Story

Most Viewed