మహేష్ బాబు హీరోయిన్ పెళ్లి ముహుర్తం ఫిక్స్!

by Disha Web Desk 4 |
మహేష్ బాబు హీరోయిన్ పెళ్లి ముహుర్తం ఫిక్స్!
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హో్త్ర గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ మీడియాలో ఈ జంట పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. జైసల్మేర్ (రాజస్థాన్) లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ ఈ వేడుకకు వేదిక కానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4,5న సంగీత్ హల్దీ(దుబాయ్ లో) ఉంటుందని, పెళ్లి రాజస్థాన్‌లో జరగనున్నట్లు సమాచారం.

కాగా ఈ జంట పెళ్లి వేడుకని డాక్యుమెంటరీగా రూపొందించనున్నట్లు తెలిసింది. కాగా ఈ విషయంపై ఈ యువ జంట స్పందించాల్సి ఉంది. 2021లో వచ్చిన షేర్షా సినిమాలో నటించిన సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కియారా తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలో నటించారు.


Next Story

Most Viewed