13 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్: మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

by Web Desk |
13 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్: మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
X

దిశ, సినిమా: మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరోచిత్రం రాబోతుందంటూ కొద్ది రోజులుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ డిస్కషన్‌ను నిజం చేస్తూ ప్రిన్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌ చెప్పింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్. ఈ మేరకు మహేష్, త్రివిక్రమ్ అప్ కమింగ్ మూవీ 'SSMB 28 చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ . ఇందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన మేకర్స్.. 'SSMB 28 షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది' అని అధికారికంగా ప్రకటించారు. ఇక వీరిద్దరి కలయికలో దాదాపు 13 ఏళ్ల తర్వాత రాబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో .. పూజా హెగ్డే హీరోయిన్ కాగా థమన్ సంగీతం సమకూరుస్తున్నట్లు సమాచారం.

https://twitter.com/haarikahassine?s=20

Next Story

Most Viewed