మహేష్, నేను డీల్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాం: నమ్రత షాకింగ్ కామెంట్స్!!

by Disha Web Desk 7 |
మహేష్, నేను డీల్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాం: నమ్రత షాకింగ్ కామెంట్స్!!
X

దిశ, వెబ్‌డెస్క్: నమ్రతా శిరోద్కర్ గురించి తెలిసిందే. 1993 లో మిస్ ఇండియాగా ఎన్నికైన ఆమె 2000 సంవత్సరంలో 'వంశీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు, నమ్రత ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. వీరిద్దరూ 2005 లో పెళ్లితో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి పూర్తిగా సినిమాలకు గుబ్‌బై చెప్పిన నమత్ర.. ఫ్యామిలీ లైఫ్‌ తో బిజీ అయిపోయింది. అయితే అప్పట్లో సినిమాల్లో అవకాశాలు వచ్చినా సున్నితంగా నో చెప్పేది నమ్రత. దీంతో కుటుంబం గురించే సినిమాలకు నో చెప్పింది అనుకున్నారు అందరూ. కానీ, మహేష్ వల్లే తాను సినిమాలకు దూరం అయ్యానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నమత్ర.

''మహేష్, నేను ప్రేమించుకున్నప్పుడే ఓ డీల్ మాట్లాడుకున్నాం. పెళ్లైన తర్వాత నేను సినిమాల్లో నటించకుండా.. గృహిణిలా ఇంటి బాధ్యతలు చూసుకోవాలని మహేష్ చెప్పాడు. నేను కూడా మనం ఉమ్మడి కుటుంబంలో కాకుండా వేరే ఇల్లు తీసుకుని ఉండాలని కోరాను. ఎందుకంటే నాకు పెద్ద బంగ్లాలు అంటే భయం. ఇలా ఇద్దరం డీల్ పెట్టుకున్నాకే పెళ్లి చేసుకున్నామని నమ్రత తెలిపింది''. కాగా నమత్ర చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

READ MORE

ఈ న్యూ ఇయర్ నా కోసం ఎదురుచూస్తోంది: Piya Valecha


Next Story