షారుక్ ఖాన్‌కు హత్య బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
షారుక్ ఖాన్‌కు హత్య బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఇటీవల 'పఠాన్', 'జవాన్' సినిమాలు విజయవంతమైన తర్వాత నటుడికి హత్య బెదిరింపులు ఎక్కువైనాయి.ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం అతని భద్రాతా స్థాయిని వై ప్లస్ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతకు సంబంధిత నిధులు నటుడు బాధ్యత వహిస్తాడు. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించనున్నారు. ఇప్పటికే తన నివాసం వద్ద ఐదుగురు సాయుధ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు భద్రత పెంచడంతో మూడు షిఫ్టుల్లో పని చేసే ఆరుగురు వ్యక్తిగత భద్రతా అధికారులు ఉంటారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నందున ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కూడా వై ప్లస్ భద్రత ఉంది.

Next Story

Most Viewed