- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానులకు మాధవన్ హెచ్చరిక.. మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానంటూ పోస్ట్
ఈ వ్యక్తికి నాకు కానీ, నా టీమ్కు కానీ ఎలాంటి సంబంధం లేదు. నా పేరు చెప్పి సోషల్ మీడియాలో అందరితో మాట్లాడుతున్నాడు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా కొంతమంది కేటుగాళ్లు సినీ సెలబ్రిటీల పేరుతో అభిమానులను దారుణంగా మోసం చేస్తూ డబ్బు కూడబెట్టుకుంటున్నారు. ఇలాంటి వాటికి సినీ సెలబ్రిటీలు నిత్యం ఎవరో ఒకరు బలవుతున్నారు. ఇక ఈ విషయంపై కొందరు కఠిన చర్యలు తీసుకుంటుండగా.. మరికొందరు మాత్రం తమ అభిమానులను అలర్ట్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తాజాగా, మాధవన్ పేరును కూడా కేటుగాళ్లు వాడుకున్నారు. ఆయన పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఈ విషయం కాస్త నటుడు ఆర్. మాధవన్ దృష్టికి వెళ్లడంతో.. తన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక పెద్ద మోసం గురించి అభిమానులను హెచ్చరించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మాధవన్ పేరుతో ఒక నకిలీ అకౌంట్ తెరిచి, తానే మాధవన్ ప్రతినిధినని చెప్పుకుంటూ ప్రజలను నమ్మిస్తున్నాడట.
తాజాగా, మాధవన్ తన ఇన్స్టాగ్రామ్లో ఆ నకిలీ అకౌంట్కు సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేశారు. "ఈ వ్యక్తికి నాకు కానీ, నా టీమ్కు కానీ ఎలాంటి సంబంధం లేదు. నా పేరు చెప్పి సోషల్ మీడియాలో అందరితో మాట్లాడుతున్నాడు. ఇదంతా పెద్ద మోసం, దయచేసి ఎవరూ నమ్మకండి" అని గట్టిగా చెప్పారు. తన అధికారిక అకౌంట్లు తప్ప వేరే ఏ ఇతర అకౌంట్లు తన తరపున మాట్లాడవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఇలాంటి పనులకు పాల్పడుతున్న వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా హెచ్చరించారు. మాధవన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలోకి రానుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ సీక్వెల్లో మాధవన్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ అజయ్ సన్యాల్గా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతుంది.






