జై బాలయ్య పాటపై ట్రోల్స్.. రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ ట్వీట్..

by Disha Web Desk 6 |
జై బాలయ్య పాటపై ట్రోల్స్.. రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్ ట్వీట్..
X

దిశ, సినిమా : గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీర సింహారెడ్డి'. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ ఇందులో వాడిన 'జై బాలయ్య జై జై బాలయ్య' అనే రిథమ్.. 'ఒసేయ్‌ రాములమ్మ' సినిమాలోని పాటను పోలి ఉండటంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 'మళ్లీ దొరికేసాడు భయ్యా' అంటూ తమన్‌ను ఆడేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇదే లిరికల్ సాంగ్‌ మేనియాపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్వీట్ చేయడంతో పెద్ద రచ్చకు దారితీసింది.

ఈ పాటలోని లిరిక్స్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు ఉన్నాయంటూ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రిపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో రామజోగయ్య శాస్త్రి ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు. 'ప్రతి పాటను ప్రాణంపెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగినవారు మాత్రమే నాతో ప్రయాణించగలరు. అన్నట్టు.. జన్మనిచ్చిన అమ్మ గారి గౌరవార్ధం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రిగా మార్చుకున్నాను. ఇందులో ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి' అని దండం పెడుతూ పోస్ట్ చేశాడు.



Next Story

Most Viewed