ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత

by Disha Web Desk 2 |
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సుప్రసిద్ధ గాయకుడు పంకజ్ ఉదాస్(72) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యం బారిన పడిన పంకజ్ ఉదాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. కాగా, గతంలో పంకజ్ ఉదాస్‌ను పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 1970లో తొలిసారి ‘తుమ్ హసీన్ మై జవాన్’ సినిమాతో పంకజ్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. వందల చిత్రాలకు తన గానంతో అద్భుతమైన పాటలు పాడారు. గుజరాత్‌లోని జెట్‌పూర్‌ పంకజ్ స్వస్థలం. అనూహ్యంగా అనారోగ్యంతో ఆయన మృతిచెందడంతో బాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన ప్రముఖులంతా సంతాపం ప్రకటిస్తున్నారు.


Next Story

Most Viewed