కట్నం విషయంలో ఉపాసనను దాటిపోయిన లావణ్య త్రిపాఠి!

by Disha Web Desk 9 |
కట్నం విషయంలో ఉపాసనను దాటిపోయిన లావణ్య త్రిపాఠి!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ఇంట్లో త్వరలోనే పెల్లి భాజాలు మోగబోతున్నాయి. ఆల్రెడీ వరుణ్-లావణ్య ప్రీవెడ్డింగ్ షూట్ కూడా అయిపోయింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ పెళ్లి పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇక వీరి వివాహం ఇటలీలో జరగబోతుందని ఆల్‌మోస్ట్ అర్థమైపోతుంది. అయితే లావణ్య మెగా కుటుంబానికి ఎంత మొత్తంలో కట్న కానుకలు తసుకువస్తుందని నెట్టింట తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. లావణ్య తీసుకొచ్చే కట్నం ఉపాసన తీసుకొచ్చిన కట్న కానుకల కన్నా ఎక్కువే అంటూ వార్తులు వినిపిస్తున్నాయి. నాగబాబు అసలు కట్నమే వద్దన్నాడట. కానీ లావణ్య ఫ్యామిలీ మాత్రం తన కుమార్తె హోదాకు అనుగుణంగా కట్నం ఇవ్వాలని అనుకున్నారట.

కాగా ఈ లొట్టచెంపల ముద్దుగుమ్మ ఇప్పటివరకు సినిమాల్లో సంపాదించిన ఒక్క పైసా కూడా తమ పేరెంట్స్ ఖర్చు చేయలేదట. ఇప్పుడు ఆ మనీ మొత్తం లావణ్యకే ఇస్తున్నారని సమాచారం. అలాగే వారసత్వంగా తన పేరు మీద రావాల్సిన ఆస్తులను కూడా ఇస్తున్నారట. ఇక ఈ హీరోయిన్‌కు పెట్టాల్సిన నగలు కూడా పెడుతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.



Next Story

Most Viewed