బిగ్ న్యూస్: తారకరత్న ఎప్పుడో చనిపోయాడు.. లక్ష్మీ పార్వతీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: తారకరత్న ఎప్పుడో చనిపోయాడు.. లక్ష్మీ పార్వతీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గుండె పోటుకు గురై మృతి చెందిన నందమూరి తారకరత్న మరణం పట్ల లక్ష్మీ పార్వతీ సంతాపం తెలిపారు. చిన్న వయస్సులోనే తారకరత్న మృతి చెందడం చాలా బాధకరమన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతీ మీడియాతో మాట్లాడుతూ తారకరత్న మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న ఎప్పుడో మరణించాడని.. కానీ లోకేష్ పాదయాత్రకు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను చంద్రబాబు ఇన్ని రోజులు దాచారని సంచలన ఆరోపణలు చేశారు.

నారా కుటుంబానికి సహయం చేయడానికి వచ్చిన తారకరత్న మరణాన్ని కూడా చంద్రబాబు, అతడి కొడుకు స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారన్నారు. గతంలో తన భర్త ఎన్టీఆర్ కూడా చంద్రబాబు వల్లే కుమిలికుమిలి చనిపోయాడని అన్నారు. తారకరత్న ఎప్పుడో మరణించిన లోకేష్ పాదయాత్రను ప్రజలు అపశకునంగా భావిస్తారని ఈ విషయాన్ని ఇన్ని రోజులు దాచారని.. కానీ చంద్రబాబు, లోకేష్ ఇద్దరు అపశకునమే అని ప్రజలకు ఎప్పుడో తెలుసని అన్నారు.

ఇలాంటి విషాద ఘటనలను కూడా రాజకీయ పబ్బం కోసం వాడుకోవడం చంద్రబాబు, అతడి కొడుక్కే తెలుసని అన్నారు. డాక్టర్లు ఎప్పుడో చనిపోయారని చెప్పినా.. ఇన్ని రోజులు తారకరత్నను ఆసుపత్రిలో ఉంచి అతడి భార్య, పిల్లలను క్షోభకు గురి చేశారన్నారు. నారా కుటుంబం ఇకనైనా ఇలాంటి నీచ రాజకీయాలకు స్వస్థి చెబుతేనే.. తమ నందమూరి కుటుంబం బాగుపడుతుందన్నారు. చంద్రబాబు వల్ల ఇప్పటికీ తాము ఒక రకమైన నరకం అనుభవిస్తున్నామని అన్నారు.

Next Story

Most Viewed