- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇదే నా చివరి రాత్రి.. క్షమించాలంటూ కన్నీళ్లు పెట్టుకున్న సింగర్
దిశ, సినిమా: అమెరికన్ స్టార్ సింగర్ లేడీ గాగా 'మయామీ' అభిమానులకు క్షమాపణలు చెప్పింది. ప్రపంచ కచేరిలో భాగంగా ప్రస్తుతం మయామీలో ప్రొగ్రామ్ చేస్తున్న ఆమె.. వాతావరణం, భద్రతా కారణాల దృష్ట్యా ప్రదర్శనను పూర్తి చేయలేకపోయానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా వెల్లడించిన సింగర్.. వరల్డ్ టూర్లో ఇదే చివరి రాత్రిగా తెలిపింది. 'ప్రతి ఒక్కరికీ హాయ్.. క్రోమాటికా బాల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. మేము నిజంగా మయామిలో ఈ రాత్రి ప్రదర్శనను పూర్తి చేయడానికి ప్రయత్నించాం.
కానీ, వర్షం కారణంగా చేయలేకపోయాం. నా బ్యాండ్, డ్యాన్సర్లతోపాటు మిమ్మల్ని సురక్షితంగా ఉంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. బాధ్యత, ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు. ఇది ఆరోగ్యకరమైన నిర్ణయంగా భావిస్తారని ఆశిస్తున్నా. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా దీని నుంచి కోలుకోవడానికి కొద్దిగా సమయం పట్టినా ఈ క్షణాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని, ఇది తన జీవితంలో గొప్ప పర్యటనగా పేర్కొంటూ ముగించింది.