వాస్తవాలను తెలుసుకుని రాయండి.. అంటూ ఆ ఛానల్‌పై అక్షయ్ కుమార్ ఫైర్

by Disha Web Desk 6 |
వాస్తవాలను తెలుసుకుని రాయండి.. అంటూ ఆ ఛానల్‌పై అక్షయ్ కుమార్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఆయన చేసిన యాడ్‌పై ట్రోల్స్ వచ్చాయి. అక్షయ్ కుమార్ గుట్కా యాడ్‌లో నటించాడని, కొత్త యాడ్ వస్తోందంటూ ఇలా నెట్టింట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా, ఇలాంటి వాటిపై అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఈ యాడ్స్ అన్నీ కూడా 2021 అక్టోబర్ 13న షూట్ చేసినవి.. నేను వాటిని ఇకపై ప్రోత్సహించను. అలాంటి యాడ్స్‌లో నటించను అని చెప్పిన తరువాత మళ్లీ ఇంత వరకు చేయలేదు. అప్పటి అగ్రిమెంట్ ప్రకారం వారు ఆ యాడ్‌ను ప్రచారం చేసుకోవచ్చు.. దానికి నేనేం చేయలేను.. వచ్చే నెలతో అగ్రిమెంట్ పూర్తవుతుంది.. ఇప్పటికైనా కాస్త చిల్ అవ్వండి.. వాస్తవాలను తెలుసుకుని రాయండి’’ అని రాసుకొచ్చాడు. అలాగే ఓ ఛానల్ పోస్ట్‌ను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం అక్షయ్ పెట్టిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Next Story

Most Viewed