- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అలాంటి పాత్ర ఏ తల్లి ఒప్పుకోదు..'లస్ట్ స్టోరీస్'పై కరణ్(Karan Johar)
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించిన 'లస్ట్ స్టోరీస్' సినిమా గురించి కరణ్ జోహార్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. 2018లో నలుగురు స్టార్ డైరెక్టర్లు కలిసి తీసిన ఈ ఆంథాలజీ .. విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. కాగా నటీనటుల ఎంపికలో చాలా మార్పులు జరిగినట్లు 'కాఫీ విత్ కరణ్' తాజా ఎపిసోడ్లో తెలిపాడు కరణ్. 'నిజానికి కియారా పాత్రని మొదట కృతి సనన్కి ఆఫర్ చేశాను. కానీ, ఈ స్టోరీ విని తన తల్లి ఒప్పుకోదని కృతి రిజెక్ట్ చేసింది. దీంతో ఏ తల్లి అయినా తన కూతురు ఈ కథ చేయడానికి అనుమతించరని అనుకున్నా. కానీ, ఒక మహిళ ఆనందానికి సంబంధించిన ఈ మంచి కథ స్త్రీలకు ఎంతో మేలుచేస్తుందని భావించా.
ఈ క్రమంలోనే కియారాని మనీష్ మల్హోత్రా ఇంట్లో కలిసి, మరుసటి రోజు నా ఇంటికి రమ్మని స్టోరీ చెప్పాను. మొదట కొంచెం సందేహపడిన కియారా.. నేనే డైరెక్ట్ చేస్తున్నానని తెలిశాక ఓకే చెప్పింది' అని వివరించాడు. అంతేకాదు కరణ్ డైరెక్షన్ చేస్తేనే నటిస్తానంటూ నిర్మాతలకు మొహమాటం లేకుండా చెప్పిందన్నాడు. ఇక 2018లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ ఆంథాలజీకి అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.