- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీలక నిర్ణయం తీసుకున్న రెట్రో డైరెక్టర్.. సిరీస్లో ఒక్కో ఎపిసోడ్లో ఒక్కోదాన్ని హైలైట్ చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju), సూర్య(suriya) కాంబోలో వచ్చిన మూవీ ‘రెట్రో’(retro).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju), సూర్య(suriya) కాంబోలో వచ్చిన మూవీ ‘రెట్రో’(retro). పూజా హెగ్డే (Pooja Hegde)హీరోయిన్గా నటించిన ఈ సినిమా థియేటర్స్లో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కార్తీక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘రెట్రో సినిమాలోని డిలీట్ చేసిన సీన్స్తో ఎక్స్టెండెడ్ వెర్షన్ను తీసుకురావాలని డిజిటల్ ఫ్లాట్ఫామ్తో చర్చిస్తున్నాను. నాలుగు నెలల తర్వాత దీన్ని సిరీస్ వెర్షన్ల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను.
ఎన్నో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు మరింత వివరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నా. ఇందుకోసం నెట్ఫ్లిక్స్తో చర్చలు జరుపుతున్నా.. కానీ వారు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కొన్ని ఎపిసోడ్లుగా దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక్కొక్కటి దాదాపు 40 నిమిషాలు ఉండేలా చూస్తున్నా. అన్ని భావోద్వేగాలు ఉండాలని.. అది కూడా ఒక్కో ఎపిసోడ్లో ఒక్కోదాన్ని హైలైట్ చేయాలని అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం సినిమాను ఒక్క సారి చూడమే ఎక్కువ అని వలు విమర్శలు చేస్తున్నారు.






