బ్రేకింగ్: బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే.. TDP, బాలయ్యకు కాపునాడు అల్టీమేటం!

by Disha Web Desk 19 |
Balakrishna Tests Corona Positive for Second time
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహాం బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. బాలయ్య హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ.. అక్కినేని తొక్కినేని, ఎస్వీ రంగారావును ఆ రంగారావు.. ఈ రంగారావు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. బాలయ్య కామెంట్స్‌పై ఇప్పటికే అక్కినేని యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ స్పందించగా.. తాజాగా ఈ అంశంపై కాపునాడు స్పందించింది. నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కాపునాడు టీడీపీ, బాలయ్యకు అల్టిమేటం జారీ చేసింది.

ఎస్వీ రంగారావును ఉద్దేశించి ఆ రంగారావు, ఈ రంగారావు అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాపునాడు తప్పుబట్టింది. ఎస్వీ రంగారావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈనెల 25 లోపు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా కాపునాడు డిమాండ్ చేసింది. ఇక ప్రముఖ టాలీవుడ్ హీరోలపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సీనియర్ హీరోల పట్ల బాలయ్య చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై పలువురు నటీనటులు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి : బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగ చైతన్య, అఖిల్ స్ట్రాంగ్ కౌంటర్



Next Story

Most Viewed