ఆస్కార్‌కు మించిన గౌరవం దక్కించుకున్న ‘కాంతార’.. ఏకంగా ఐరాసలోనే

by Disha Web Desk 6 |
ఆస్కార్‌కు మించిన గౌరవం దక్కించుకున్న ‘కాంతార’.. ఏకంగా ఐరాసలోనే
X

దిశ, సినిమా : కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి నటించి, తెరకెక్కించిన సినిమా ‘కాంతార’. రూ.15కోట్లతో రూపొందిన చిత్రం 4వందల కోట్లకు పైగా వసూల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ మూవీ మరోసారి కన్నడ పరిశ్రను ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేసింది. విషయానికొస్తే.. ఐరాస కార్యాయలంలోని పదమూడో నెంబర్ హాల్‌లోని బాలెక్సర్ట్ థియేటర్‌లో మార్చి 17న ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

ఎందుకంటే ఇందులో భూత కోల సంప్రదాయం, అటవీ పరిరక్షణ, అంతరించిపోతోన్న జాతుల సంరక్షణ, అడవి మనుషుల జీవన విధానాలను అంతర్లీనంగా చిత్రీకరించడమే దీని ప్రత్యేకత. అంతేకాదు ఐరాసలో ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చర్చించబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపై స్పందించిన రిషబ్ సంతోషంగా ఉందని చెప్పగా.. ‘ఇది ఆస్కార్ కంటే అరుదైన గుర్తింపు. ఇలాంటి గౌరవాన్ని డబ్బుతో కొనలేము’ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.



Next Story

Most Viewed