ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ తో.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన Kangana Ranaut

by Dishafeatures1 |
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ తో.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన Kangana Ranaut
X

దిశ, సినిమా: ఇటీవల ‘పరీక్ష పే చర్చ 2024’ కార్యక్రమాన్ని ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ భారత్ మండపంలోని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషిస్తూ మొత్తం 25 సూత్రాలు పిల్లలతో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో భారతదేశం అంతటా వైరల్ అవుతున్న సందర్భంగా, బాలీవుడ్ ప్రముఖులు కంగనా రనౌత్, ఆర్.మాధవన్ కూడా మోదీ ని ప్రశంసించారు.

కాగా ముందుగా కంగనా రనౌత్ వీడియోను పంచుకుంటూ ‘యువ తరానికి అతి పెద్ద శత్రువు అయిన గందరగోళ మనస్సును ఎలా నివారించాలి, జీవితంలోని రహస్యమైన సత్యాన్ని ప్రధాని ఎంత సరళంగా సులభంగా వివరిస్తున్నారో చూడండి’ అని క్యాప్షన్‌లో రాసింది. ఇక ఆర్ మాధవన్ కూడా ఈ వీడియోను పంచుకుంటూ ఇలా వ్రాశాడు ‘విద్యార్థుల జీవితాలను రూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ఉంటుంది, కనుక వారు చెప్పినట్లు పిల్లలు అంగీకరించాలి’ అంటూ తెలిపాడు.




Next Story