‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రచారంలో నవీన్‌తో పాటు కేఏ పాల్ కూడా.. (వీడియో వైరల్)

by Disha Web Desk 6 |
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రచారంలో నవీన్‌తో పాటు కేఏ పాల్ కూడా.. (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, నవీన్ పొలిశెట్టి కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే నవీన్ పొలిశెట్టి వైజాగ్‌లో ప్రచారం చేస్తున్నాడు. నిన్న సాయంత్రం నవీన్ RK బీచ్ రోడ్ లో వెళ్తుండగా కేఏ పాల్ కూడా అదే సమయంలో RK బీచ్ రోడ్ లో ప్రజలకు అభివాదం చేస్తున్నారు. దీంతో నవీన్ తన కారుని ఆపి కారు పైన డెక్ తీసి బయటకు వచ్చి కేఏ పాల్ ని పలకరించారు. ఒకరికొకరు హాయ్ చెప్పుకొని ప్రజలకు కలిసి అభివాదం చేశారు. అనంతరం నవీన్ వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read More: బన్నీలో నాకు బాగా నచ్చిన విషయం అదే : శ్రీరెడ్డి ట్వీట్ వైరల్



Next Story

Most Viewed