హీరోయిన్లను చంపేస్తున్న ‘జవాన్’ డైరెక్టర్ అట్లీ.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 6 |
హీరోయిన్లను చంపేస్తున్న ‘జవాన్’ డైరెక్టర్ అట్లీ.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఆయన ఒకరు. అట్లీ ‘రాజారాణి’ సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అట్లీ అనంతరం దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అయ్యాయి. అట్లీ ఇటీవల బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంతో బాక్సాఫీసును షేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, అట్లీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన సినిమాల్లో హీరోయిన్లను చంపుతూ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ డైరెక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆయన తెరకెక్కించిన మొట్టమొదటి చిత్రం రాజారాణి ఈ సినిమాలో నజ్రియా కారు యాక్సిడెంట్‌లో చనిపోతుంది. అలాగే రెండో సినిమా తేరిలో సమంత బుల్లెట్ తగిలి మరణిస్తుంది. మెర్సల్ సినిమాలో నిత్యా మీనన్ పాత్ర చనిపోయేలాగా చూపించారు. అంతేకాకుండా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన జవాన్‌లో దీపికా పదుకొనే కూడా చనిపోతుంది. దీంతో అట్లీ కథను ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడం కోసం హీరోయిన్లను ఆయన సినిమాల్లో చంపేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Read More..

మున్ముందు అత్యంత దారుణంగా సమంత పరిస్థితి.. జాతకంలో అసలు ఏముందో తెలుసా?

Next Story