Jacqueline Fernandez షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు..

by Disha Web Desk 7 |
Jacqueline Fernandez షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు..
X

దిశ, సినిమా : రూ. 200 కోట్ల దోపిడి కేసులో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ పాటియాలా కోర్టు సమన్లు జారీ చేసింది. సుఖేష్ చంద్రశేఖర్‌ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్‌ను కూడా నిందితురాలిగా పేర్కొనగా.. సెప్టెంబర్ 26న కోర్టుకు హాజరుకావాలని సూచించింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌తో సహా ఉన్నత స్థాయి వ్యక్తులను మోసం చేయడం ద్వారా సుఖేష్ జాక్వెలిన్‌కు ఖరీదైన బహుమతులు కొనుగోలు చేయడానికి డబ్బును ఉపయోగించారని ED ఆరోపించింది. కాగా ఈ కేసులో జాక్వెలిన్‌ను చాలాసార్లు ప్రశ్నించిన ఏజెన్సీ.. ఆగస్టు 17న ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ చార్జ్ షీట్ ఫైల్ చేసింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

హనీమూన్ నుంచి పారిపోయిన హీరో..


Next Story

Most Viewed