Janhvi Kapoor: అది నైతిక వైఫల్యం కాదు.. మనసు పడుతున్న ఆవేదన.. జాన్వీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిని విమర్శించడం లేదా తక్కువ చేసి చూడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, అది కేవలం వారిని మరింత దూరం చేస్తుందని ఆమె అన్నారు.

Janhvi Kapoor: అది నైతిక వైఫల్యం కాదు.. మనసు పడుతున్న ఆవేదన.. జాన్వీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఓ కార్యక్రమంలో పాల్గొని మద్యపాన వ్యసనం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆఫ్ ది రాక్స్' అనే ప్రచార కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవనశైలిలో మద్యం సేవించడం అనేది చాలా సాధారణ విషయంగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు. కేవలం సరదా కోసం తాగే అలవాటు ఎప్పుడు ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యగా మారుతుందనే దానిపై ప్రజల్లో కనీస అవగాహన లేకపోవడం ఆందోళనకరమని ఆమె పేర్కొన్నారు. మద్యపాన వ్యసనాన్ని సమాజం చూసే విధానంలో మార్పు రావాలని జాన్వీ ఈ సందర్భంగా గట్టిగా నొక్కి చెప్పారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిని విమర్శించడం లేదా తక్కువ చేసి చూడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, అది కేవలం వారిని మరింత దూరం చేస్తుందని ఆమె అన్నారు. మద్యపాన వ్యసనం అనేది ఒక నైతిక వైఫల్యం కాదని, అది ఒక క్లినికల్, మానసిక ఆరోగ్య సమస్య అని ఆమె స్పష్టం చేశారు.

దీనిని ఒక జబ్బుగా గుర్తించి, బాధిత వ్యక్తులకు సరైన వైద్య చికిత్స, మానసిక నిపుణుల సహాయం అందేలా చూడటమే ఈ సామాజిక కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆమె వివరించారు. ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే, ఆమె ఇటీవల నటించిన ‘సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹100 కోట్ల వసూళ్లతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె తన తదుపరి భారీ ప్రాజెక్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై దృష్టి పెట్టింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా చిత్రం 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘దేవర’ తర్వాత తెలుగులో ఆమె నటిస్తున్న రెండో చిత్రం కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story