టాలీవుడ్ పై ఇంత కోపం ఉందా.. ఇష్టానుసారంగా కామెంట్స్‌ చేస్తున్న తాప్సి

by Disha Web Desk 10 |
టాలీవుడ్ పై ఇంత కోపం ఉందా..  ఇష్టానుసారంగా కామెంట్స్‌ చేస్తున్న తాప్సి
X

దిశ, వెబ్ డెస్క్: మంచు మనోజ్ హీరోగా పరిచయమైన 'ఝుమ్మంది నాదం' సినిమాతో తాప్సి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆమె నటించిన మొదటి సినిమానే అయినా మంచి మార్కులు వేపించుకుంది. సొట్ట బుగ్గల సుందరి అంటూ ప్రేక్షకులతో ముద్దుగా పిలిపించుకుంది. తెలుగులో స్టార్ హీరోలతో చేసినా మంచి ఫలితం రాలేదు. తెలుగులో మాత్రం అవకాశాలు లేక పోవడంతో బాలీవుడ్ కే పరిమితమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మళ్ళీ వచ్చే ఆలోచనలు లేనట్లు ఉన్నాయి.. ఈ మధ్య ఆమె ఇష్టానుసారంగా తెలుగు సినిమా పరిశ్రమ అంటే చాలు మండిపడుతుంది.

సినీ కెరియర్ ఆరంభంలో చాలా మంది తనను విమర్శించారని.. తాను చేసిన సినిమాలు హిట్ అవ్వకపోవడంతో అనరాని మాటలు అన్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుంచి రాలేదని.. అందుకే కెరియర్ మొదట్లో సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయానని, నేను నటించడం వల్లే సినిమాలు ఫెయిల్ అయ్యాయి అన్నట్ట్లుకామెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని రోజులు తన మనసులో ఇండస్ట్రీపై ఇంత కోపాన్ని పెట్టుకుందా అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు.

Read More : తెలుగు సినిమాపై తాప్సీ కామెంట్స్.. మూవీ హిట్ అయితే హీరోకు జేజేలు.. లేదంటే హీరోయిన్లు బలి

Next Story

Most Viewed