కరెన్సీ నోట్లపై రాస్తే చెల్లుబాటు అవుతుందా ? అవ్వదా ?

by Disha Web Desk 10 |
కరెన్సీ నోట్లపై రాస్తే చెల్లుబాటు అవుతుందా ? అవ్వదా ?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఆర్బీఐ‌కు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రూ . 100,రూ. 200,రూ. 500,రూ. 2000 కరెన్సీ నోట్లపై కొంత మంది గుర్తు కోసం పెన్నుతో గీతలు, రాయడం లాంటివి చేస్తుంటారు. అలా రాసిన నోట్లు చెల్లుతాయా ? లేదా అన్నది చాలా మందికి సందేహం ఉంది. ఈ నోటు చెల్లు బాటు అవ్వదని ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియా గ్రూప్స్ లో బాగా షేర్ చేస్తున్నారు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి..తేల్చి చెప్పేసింది. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టి పారేసింది. ఈ మేరకు పిఐబి ఫ్యాకెట్ ట్వీట్ చేసింది. వైరల్ అవుతున్న మెసేజ్ నిజం కాదని చెప్పేసింది. అలాగే కరెన్సీ నోట్లపై రాతలు రాయకండని కోరింది. నోట్ల పై అలా రాయడం వల్ల వాటి జీవిత కాలం తగ్గుతుందని పేర్కొంది.చినిగిపోయిన నోట్లను , పాత నోట్లను మార్చుకునే అవకాశం బ్యాంక్ కల్పిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed