థియేటర్లలో రిలీజ్ కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా..

by Chukka Sudharani |   (  Updated:2023-10-05 10:31:18  IST  )

తమిళ స్టార్ హీరో ఆది పినిశెట్టి, యాపిల్ బ్యూటీ హన్సిక జంటగా నటించిన సినిమా ‘పార్ట్నర్’.

థియేటర్లలో రిలీజ్ కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో ఆది పినిశెట్టి, యాపిల్ బ్యూటీ హన్సిక జంటగా నటించిన సినిమా ‘పార్ట్నర్’. సైన్స్ ఫిక్షన్ & కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహించారు. యోగిబాబు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం.. తమిళంలో ఆగస్ట్ 25 విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే.. ఇప్పుడు ఈ మూవీని తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాకముందే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 6 వ తేదీ నుంచి సింప్లీ సౌత్ ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుండగా.. కేవలం ఓవర్ సీప్ ఆడియెన్స్‌కు మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు సమాచానం. ఇక అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వరలో తెలుగు, తమిళ ఆడియెన్స్ ముందుకు ‘పార్ట్నర్’ రాబోతున్నట్లు టాక్. అంతే కాకుండా.. తమిళంలో రిలీజైన టైటిల్ తోనే తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read More: నా వల్లే సల్మాన్‌ సినిమా ఫ్లాప్‌ అయిందని చచ్చిపోమన్నారు.. నటి కామెంట్స్

Next Story