- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రామాయణ’ నుంచి నేను తప్పుకోలేదు.. తప్పుడు వార్తలు నమ్మకండి: విక్రాంత్ మాస్సే
అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణ’(Ramayana) చిత్రంపై వస్తున్న పుకార్లకు నటుడు విక్రాంత్ మాస్సే చెక్ పెట్టాడు

దిశ, సినిమా: అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణ’(Ramayana) చిత్రంపై వస్తున్న పుకార్లకు నటుడు విక్రాంత్ మాస్సే చెక్ పెట్టాడు. ఈ చిత్రంలో రావణుడి కుమారుడు ‘మేఘనాథుడు’ (ఇంద్రజిత్) పాత్రకు విక్రాంత్ ఎంపికయ్యారని, అయితే కాల్షీట్స్ సర్దుబాటు కాక ఆయన తప్పుకున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ విషయంపై విక్రాంత్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఘాటుగా స్పందించాడు. ‘‘నేను ఎప్పుడూ ఈ సినిమాలో భాగం కాలేదు. నేను ఇందులోంచి తప్పుకోలేదు. నాకు అసలు అవకాశమే రాలేదు. మీడియాలో వస్తున్న బాధ్యతారాహిత్యమైన వార్తలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దయచేసి తప్పుడు వార్తలను నమ్మకండి. ’’ అని స్పష్టం చేస్తూనే, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తానూ అందరిలాగే టికెట్ కొని థియేటర్లో సినిమా చూస్తానని పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం.. మేఘనాథుడి పాత్రకు నటుడు రాఘవ్ జుయల్ ఎంపికయ్యారట.
ఈ పాత్ర రామాయణ రెండో భాగంలో అత్యంత కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. మేఘనాథుడి పవర్ఫుల్ పాత్రకు రాఘవ్ జుయల్ సరిగ్గా సరిపోతారని దర్శకుడు నితేష్ తివారీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా స్టార్స్ భాగం అయ్యారు. శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తుండగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే దశరథుడిగా అరుణ్ గోవిల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ దృశ్యకావ్యంలో మొదటి భాగం 2026 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.






