మానసిక క్షోభను బయటపెట్టిన హీరోయిన్ : Mamata Mohan Das

by Disha Web Desk 6 |
మానసిక క్షోభను బయటపెట్టిన హీరోయిన్ : Mamata Mohan Das
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి మమత మోహన్ దాస్ గురించి పరిచయం అక్కర్లేదు. కెరియర్ బిగినింగ్‌లోనే స్టార్ హీరోలతో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్‌గా సాగుతుండగా, అనుకోకుండా క్యాన్సర్ బారిన పడింది.

రెండు సార్లు ఆమెను క్యాన్సర్ ఎటాక్ చేయగా పోరాడి నిలబడింది. క్యాన్సర్ నుంచి విముక్తి పొందింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తాను అనుభవించిన మానసిక క్షోభను బయట పెట్టింది. ''నేను మూవీ షూటింగ్ టైంలో నా ఒంటి‌పై మచ్చలు గమనించాను. అవి ముఖం, చేతులు, మెడపై వ్యాపించాయి. టెస్ట్ చేయించుకుంటే బొల్లి వ్యాధి అని తేలింది. అయితే క్యాన్సర్ సోకినప్పుడు నా మిత్రులు, సన్నిహితులతో సమస్యను చెప్పుకున్నాను.

వారు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. అయినప్పటికీ ఒంటరిగా కూర్చుని ఏడ్చే దాన్ని. తర్వాత మెడిసిన్ వాడుతుంటే ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. దీంతో మందులు తగ్గించాను. కానీ ఈ వ్యాధి గురించి బయట పెట్టలేకపోయాను. ఎప్పుడూ కెమెరా ముందు ఉండే నేను ఒంటరితనాన్ని భరించలేకపోయా. వెంటనే నాకు సోకిన బొల్లి వ్యాధి గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాను. ఇప్పుడు కొంత ప్రశాంతంగా ఉంది, ఎవరైనా నా శరీరానికి ఏమైందని అడిగితే మొహమాటం లేకుండా చెబుతాను. కావాలంటే నా ఇన్ స్టా చూడండి అని'' అంటూ చెప్పుకొచ్చింది మమత.

Also Read..

ఆ నటుడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు: అంజలి


Next Story