నేను చనిపోయాక ఏం చేయాలో ముందే ప్రిపేర్ చేస్తున్నా.. Posani సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 9 |
నేను చనిపోయాక ఏం చేయాలో ముందే ప్రిపేర్ చేస్తున్నా.. Posani సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కమెడియన్ పోసాని కృష్ణ మురళి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం రాజకీయ అంశాలపై స్పందిస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా.. పోసాని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు విషయాలు వెల్లడించారు. ‘‘నేను చనిపోతే శవాన్ని పరిశ్రమలో ఎవరూ చూడకూడదు. రక్తసంబంధం ఉన్నవారు, బంధువులు తప్ప ఇంకేవరు చూడటానికి రావొద్దు. దీని కోసం నా భార్యను, కుటుంబాన్ని, బాగా ప్రిపేర్ చేశాను. ‘నా భర్త లేడు ఇప్పుడు అయ్యో నా జీవితం ఎలా?’ అని నా భార్య భయపడకూడదు.

తన పేరు మీద ఆల్‌రెడీ 50 కోట్ల రూపాయల ఆస్తి రాశాను. నేను పోయినాక నా పిల్లల్లో మార్పు రావొచ్చు. ఆమెను వదిలేసి ఫారెన్ వెళ్లొచ్చు. అందుకే ఆస్తులన్నీ నా భార్యపై రాశాను. నాకు జీవితం పట్ల ఎలాంటి దిగులు లేదు. ఎవరైనా ఇప్పుడే నా గొంతు కోపి చంపేసిన ఏ ఒక్కరు కూడా నా కోసం చిన్నటి కన్నీటి చుక్క కూడా కార్చొద్దు. నాపై సింపతి సూపించడం నాకు అస్సలు నచ్చదు.’’ అంటూ పోశాని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కమెడియన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Next Story